Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
సీపీఐ(ఎం) పార్టీకి చెందిన వేమిరెడ్డి కృష్ణారెడ్డి మండలంలోని లక్ష్యంపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ సీనియర్ నాయకులు, తాతా భాస్కరరావు అన్నారు. అదేవి ధంగా కలకోడిమా గ్రామంలో పార్టీ సానుభూతిపరులు అనంతోజు శ్రీని వాసచారి (40) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. మృతదేహాన్ని తాత భాస్కర్ రావు, శీలం సత్యనారాయణ రెడ్డి, రామలింగేశ్వర రావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు, వారి సేవలను కొనియాడారు.