Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
15వ డివిజన్ పరిధిలోని పుట్ట కోట రుద్రం కోటాలో కాంగ్రెస్, టిడిపి బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి యర్రబోయిన అశ్విని శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలని నాయకులు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల వెంట ఉండే నాయకులు ఆధరించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు బారి మల్సూర్, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, సిపిఎం అర్బన్ కార్యదర్శి ఎస్కే మీరా, యర్రబోయిన గోవిందరావు, ఉపేందర్, రాము, తాజా మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.