Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
వాతావరణ శాఖ సూచనల మేరకు ఖమ్మం జిల్లాలో రాగల రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు పంట ఉత్పత్తులు తడవకుండా జాగ్రత్త చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు తగ్గి వాతావరణం సాధారణ స్థాయికి వచ్చే వరకు రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కోసిన ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.