Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పకడ్భందీగా బందోబస్తు విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ సిబ్బందికి సూచించారు. ఖమ్మం నగర పరిధిలోని 60 డివిజన్లలో శుక్రవారం జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నగరంలోని పలు పొలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సందర్శించారు.పోలింగ్ స్టేషన్ల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. ప్రధానంగా ఓటర్లు ఎలాంటి ఇబ్బందుకు గురి కాకుండా నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కావలసిన సిబ్బందిని కేటాయించడంతో పాటు సమస్యాత్మకంగా, అతి సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి సారించి పోలీసు అధికారులను బందోబస్తు కోసం నియమించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.