Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ బోనకల్ మండలంలో బుధవారం సంపూర్ణంగా జరిగింది. స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో వివిధ రకాల షాపు యజమానులు ఉదయం ఆరు గంటలకే తమ తమ షాపులను తెరిచారు. 10 గంటలకు అన్ని రకాల షాపులను షాపు యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం నుంచే బోనకల్ ఎస్ఐ బీ కొండల్ రావు ట్రైన్ ఎస్ఐ ఎం.సురేష్ సిబ్బందితో కలిసి స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో పెట్రోలింగ్ నిర్వహించారు. 10 గంటల వరకు ఎక్కడ చూసినా స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో ప్రజల రద్దీ విపరీతంగా కనిపించింది. కిరాణా షాపులకు కూరగాయల షాపుల వద్ద ప్రజలు రద్దీ విపరీతంగా ఉంది. పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుంచి ప్రజలు మండల కేంద్రానికి వచ్చారు. 10 గంటల వరకు జనంతో కిటకిటలాడిన స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ 10 గంటల తర్వాత నిర్మానుష్యంగా మారింది. లాక్డౌన్ సంపూర్ణంగా విజయవంతంగా ప్రారంభమైంది.