Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తాగు నీటి కోసం గోస పడుతున్నాం...ఏడాది కాలంగా మిషన్ భగీరధ నీరు ఎరుగం.. మంచినీటి పైపు పగిలినా పట్టించు కోవడం లేదంటూ నవతెలంగాణ పత్రికలో శుక్రవారం కె.లకీëపురం గ్రామస్తులు ఎదుర్కొంటున్న తాగు నీటి సమస్య పై నవతెంగాణ పత్రికలో ప్రత్యేక కధనం ప్రచురిం చడం జరిగింది. నవతెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు శుక్రవారం యుద్ధ ప్రాతిపదికన పైపు లైను మరమ్మతుల పనులు చేపట్టి గ్రామస్తులకు తాగు నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. పైపు లైను మరమ్మతులను ఎంపీడీఓ ముత్యాలరావు, పెద్దనల్లబల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరావులు దగ్గర ఉండి పర్యవేక్షించారు. వారి వెంట పెద్దనల్లబల్లి పంచాయతీ కార్యదర్శి సరోజ, చిన్ననల్లబల్లి పంచాయతీ కార్యదర్శి శోభారాణి తదితరులు ఉన్నారు.