Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్ తరాల కోసమే ఏజెన్సీకి మెడికల్ కాలేజీల మంజూరు
- కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు
- ప్రజా సంక్షేమం మంత్రి పువ్వాడ లక్ష్యం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్ నాయకులు పరిస్థితులు, సమస్యల పై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంఎల్.సి.బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు మండి పడ్డారు. పార్టీ జిల్లాకార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తరాలను దష్టిలో ఉంచుకొని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం గిరిజన ప్రాంతాల్లో ఆరు మెడికల్ కళాశాలలను మంజూరు చేసిందన్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో అధికంగా ఖాళీగా ఉన్న డాక్టర్ ల పోస్టులను భర్తీ చేయవచ్చు అన్నారు. తద్వారా ఏజన్సీ లో మెరుగైన వైద్యం అందుబాటులో కి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా హర్షిస్తున్నారన్నారు. కాంగ్రెస్ వారు మాత్రం కనీస అవగాహన లేకుండా మంత్రిపై, ఆయన వ్యాపారాల పై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రోగులకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచి అనునిత్యం పర్యవేక్షిస్తున్న వ్యక్తి మంత్రి అజరు అన్నారు. కానీ ఏదోఒకటి మాట్లాడాలి కాబట్టి ఖమ్మంకు కళాశాల రాకుండా మంత్రి అడ్డుకున్నారని వ్యాఖ్యానించడం పట్ల ధ్వజమెత్తారు. కోవిడ్ విషయంలో గతంలో వైద్య శాలలు ఎలా ఉన్నాయో...ప్రస్తుతం ఎలా ఉన్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీని తమ చేతిలో వుంచుకొని తెలంగాణ కు వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే మెరుగైన వ్యాక్సినేషన్ చేయిస్తున్నారని తెలిపారు. రెమ్ డెసివిర్ కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం ఆయా కంపెనీలతో చర్చించి అన్నిరకాల సేవలను రోగులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. దీన్ని చూసి తట్టుకోలేక అవాక్కలు చేవాక్కలు పేలుతున్నారని విమర్శించారు. కోవిడ్ నియంత్రణకు భట్టి మాదిరి వ్యవహరించకుండా మంత్రి నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి మధిర ఆసుపత్రిని బాగు చేయించుకోలేని భట్టి ప్రభుత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, ఉప మేయర్ షేక్ ఫాతిమా జోహారా, కమర్తపు మురళి, తాజ్,ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.