Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మండలం కూనవరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ఉప్పతల రామారావుకి ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆర్ధికసా యం అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు ఉప్పతల రామారావు ద్విచక్ర వాహనం నుండి ప్రమాదానికి గురికావడంతో ఆయన్ని గురువారం విప్ రేగా కాంతారావు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ఆయనకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.20వేలును అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మెన్ కుర్రి నాగేశ్వరరావు, కోఆప్సన్ సభ్యులు జావిద్పాషా, పట్టణ అధ్యక్షులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.