Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
కరోనా కష్టకాలంలో పేదలకు నిత్యావసరాలు వితరణ చేయడం అభినందనీయమని టీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. సోమవారం సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలో శాంతి ప్రపంచం సేవా సంస్థ నిర్వాహకులు బి.సువర్ణకుమార్ ఆధ్వర్యంలో అక్కడి పేదలకు నిత్యావసర సరుకులను దయానంద్ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ డి.పుల్లమ్మ, వెంకటా రామారావు, భాస్కరరావు, శ్రావణ్ కుమార్, భానుప్రకాశ్, సుధాకర్, ప్రభాకర్, రాంబాబు, శ్రీధర్, ప్రసాద్ పాల్గొన్నారు.