Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
మండల కేంద్రమైన బోనకల్ గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు ఆ గ్రామ సర్పంచ్ సైదా నాయక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి దామల్ల కిరణ్ చేపట్టారు. హైపోక్లోరైట్ ద్రావకంతో పాటు బ్లీచింగ్ పౌడర్ కూడా ట్రాక్టర్ ద్వారా చల్లుతున్నారు. సర్పంచ్ స్వయంగా ట్రాక్టర్ వెంట ఉంటూ అవసరమైన చోట ఎక్కువగా బ్లీచింగ్ పౌడర్ కరోన రక్షణ చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా సైదా నాయక్ మాట్లాడుతూ మండల కేంద్రానికి ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఆయన వెంట గ్రామపంచాయతీ సిబ్బంది అంతోటి రమేష్ మంద నాగరాజు అంతోటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.న