Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
లైసెన్సు రెన్యువల్ లేకుండా నిబంధనలు అతిక్రమించి ఖమ్మం నగరంలోని గాంధీచౌక్ ప్రాంతానికి చెందిన భాస్కర్ సీడ్స్ ఏజన్సీ దుకాణాన్ని వ్యవసాయ శాఖ అధికారులు కిశోర్, శ్రీనివాస్, ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామనుజం, సిఐ రవికుమార్, త్రీ టౌన్ సిఐ శ్రీధర్ తనిఖీ చేసి సీజ్ చేశారు. 26 లక్షల విలువ చేసే ప్రాపర్టీని పంచనామా చేసి వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం త్రీ టౌన్ పోలీసు స్టేషన్ కు అప్పగించారు.