Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
బహుజన సమాజ్ పార్టీ పినపాక నియోజకవర్గ అధ్యక్షులుగా పిల్లి అఖిల్కుమార్ను నియమిస్తున్నట్టు జిల్లా అధ్యక్షులు ఎర్ర కామేష్ తెలిపారు. గురువారం పివికాలనీకి చెందిన అఖిల్కుమార్కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 85శాతం వున్న బహుజనులు, రాజ్యాది óకారానికి దూరం అవతున్నారంటే వారికి అవగాహణ లేకపోవడమే అన్నారు. బహుజనలకు రాజ్యాధికారమే లక్ష్యంగా నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలంలో బుత్ స్థాయి నుండి కమిటీలు వేసి బలోపేతం చేస్తామన్నారు. నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్, మహుబుబాద్ పార్లమెంట్ కోఅర్డినేటర్ ఇర్పా కామరాజులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో వేమూరి రఘు, బి.శంకర్, చెలికానీ సాంబశివరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.