Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామేపల్లి
కామేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి శుభ్రం చేయాలని, కరోనా పరీక్షలు విస్తృతంగా చేయాలని, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని అన్నారు. మండలంలో కరోనా పరీక్షలు అవసరమైన వారికి చేసి పాజిటీవ్ వచ్చిన వారిని ప్రభుత్వ వైద్యం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ షేక్శిలార్, సాహెబ్, తహశీల్దార్ డి.ప్రసాద్, ఎస్ఐ స్రవంతి, డాక్టర్ వేముల స్రవంతి, సర్పంచ్ ఆజ్మీర రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.