Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
లాక్ డౌన్ సమయంలో ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళెందుకు ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద ఆటోల కోసం ఎదురుచూస్తూ..నిండు గర్భిణీ రోడ్లపై ఇబ్బంది పడుతున్నట్లు గమనించిన ఖమ్మం టూ టౌన్ సిఐ కరుణకర్ తన పోలీస్ వాహనంలో ఎక్కించి అమె ఇంటి వరకు క్షేమంగా పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా శనివారం సాయంత్రం లాక్ డౌన్ సమయంలో సర్జరీ జరిగిన ఓ మహిళ అనారోగ్యంతో స్కూటిపై వెళ్ళెందుకు ఇబ్బంది పడుతూ వర్షంలో తడుస్తున్న కుటుంబ సభ్యులను ఎస్సై శ్రవణ్ కుమార్ వివరాలు తెలుసుకొని పోలీస్ పెట్రోలింగ్ కారులో ఎక్కించి ప్రకాష్ నగర్ లోని అమె ఇంటి వరకు క్షేమంగా పంపించారు.