Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
సమయం, రవాణా వ్యయాన్ని నియంత్రించేందుకు ట్రాన్సఫర్ స్టేషను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. రూ.1.32 కోట్లతో ఖమ్మం నగరం దానవాయిగూడెం డంపింగ్ యార్డులో నిర్మించిన మిని ట్రాన్స్ఫర్ స్టేషన్ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. నగరంలో ప్రతిరోజు వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఇంటింటి నుండి సేకరిస్తున్న తడి, పొడి చెత్తను, ఆయా డివిజన్లకు కేటాయించబడిన ఆటోలు, ట్రాక్టర్లు మల్లేమడుగు డంపింగ్ యార్డుకు వెల్లకుండా ఇంధన ఖర్చును తగ్గించి సమాయాన్ని వృథా కాకుండా దానవాయిగూడెంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫర్ స్టేషనుకు తరలించనట్లయితే అక్కడే క్రంప్రెస్ చేయడంతో పాటు మల్లెమడుగు డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందని తద్వారా సమయం, రవాణా వ్యయంను నియంత్రించవచ్చన్నారు.
సూపర్ స్పెడర్ వ్యాక్సినేషన్లో భాగంగా ఆటో డ్రైవర్స్, క్యాబ్, మ్యాక్స్, మినీ వ్యాన్ డ్రైవర్స్కు జిల్లా ట్రాన్స్పోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. అనంతరం కోవిడ్ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న కోవిడ్ బాధితులకు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సమకూర్చిన పండ్లను గట్టయ్య సెంటర్లోని రోటరీ క్లబ్ నందు మంత్రి పంపిణీ చేశారు. వీధి వ్యాపారులు రోడ్డుకిరువైపుల తమ వ్యాపారాలను నిర్వహించడంతో ట్రాఫిక్ సమస్యతో పాటు వారికి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో వారికి ప్రత్యేక మార్కెట్ను నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ రోటరీనగర్ రూ.37 లక్షలతో నిర్మించనున్న వీధివ్యాపారులు మార్కెట్ నిర్మాణ పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నూతన బస్టాండ్ ప్రాంతంలో సువిశాలమైన ప్రాంతంలో వీధివ్యాపారులకు షాపులను కేటాయించడం జరిగిందన్నారు. వారి సంక్షేమం కోసం కోవిడ్ నేపథ్యంలో వీధివ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయల చొప్పున ఆర్థిక చేయూతనందించడం జరిగిందన్నారు.
ఖమ్మం-బోనకల్ రోడ్డుకు ధంసలాపురం వద్ద రైల్వేలైన్ వంతెన నిర్మాణం పనుల్లో భాగంగా రైల్వే అండర్ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం, మెయిన్ రోడ్కు అనుసంధానం చేయడం, రోడ్లను అభివృద్ధి పర్చడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. ఖమ్మం నగరం ధంసలాపురం నందు రవాణాకు అంతరాయం లేకుండా రూ.16.94 కోట్లతో నిర్మించనున్న ధంసలాపురం- బోనకల్ రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణపు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, డిప్యూటీ మేయర్ షేక్. ఫాతిమా జోహరా, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా మాలతీ, జిల్లా రవాణా శాఖాధికారి కిషన్రావు, కార్పోరేటర్లు కమర్తపు మురళి, పగడాల శ్రీవిద్య, కర్నాటి కృష్ణ, హుస్సేన్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.