Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కామేపల్లి
కరోనా బాధితులకు మండల పరిధిలోని మద్దులపల్లి సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఎస్ఐ జి.స్రవంతి, ట్రైనీ ఎస్ఐ సురేష్ల చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా బాధితులను ఆదుకోవడంలో తమ పార్టీ ముందుంటుందన్నారు. కరోనా బాధితులు ఫోన్ చేస్తే ఒక్క రూపాయి ఖర్చులేకుండా అంబులెన్స్ను పంపి అవసరమైన ఆసుపత్రికి చేర్పిస్తామన్నారు. మద్దులపల్లిలోని 20 మంది కరోనా బాధితులకు బియ్యం, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామశాఖను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, పార్టీ మండల కార్యదర్శి అంబటీ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ పులసం జయమ్మ, యంపిటిసి గబ్రూ నాయక్, గుండా వెంకటరెడ్డి, లవుద్యా రమా, అడపా రామనాధం, కుందురి వెంకటరెడ్డి, సకినాల శ్రీను పాల్గొన్నారు.