Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒలంపిక్ డే రన్ను బుధవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ సర్దార్ పటేల్ స్టేడియం వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి, జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా ఛైర్మన్ విజరు, జిల్లా స్పోర్ట్స్ అధికారి పరందామ రెడ్డి, ఏసీపీలు రామోజీ రమేష్, ఆంజనేయులు, సీఐ తుమ్మా గోపీ, శ్రీధర్లు, ఒలింపిక్ ప్రతినిధులు పాల్గొన్నారు.