Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రాష్ట మంత్రివర్యులు పువ్వాడ అజరు కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలో కరోనా సోకిన భాదిత కుటుంబాలకు గురువారం నిత్యవసరాలను అందజేశారు. మండలంలోని రేగుబల్లి, దంతెనం, చిన్ననల్లబల్లి గ్రామాలలో కరోనా సోకిన 60 బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ మండల అద్యక్షుడు అన్నె సత్యనారాయణ మూర్తి, జెడ్పీటీసి సభ్యురాలు తెల్లం సీతమ్మ చేతుల మీదుగా నిత్యవసరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తునికి కామేశ్వరరావు, సీనియర్ నాయకులు కొత్తూరి సీతారామారావు, రైతుబందు మండల మహిళా నాయకురాలు పూసం సావిత్రి, పిఏసిఎస్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.