Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలకరితో ఆశల సాగుకు అన్నదాత అడుగులు
- వానాకాలం పంటలో 29,145 ఎకరాల సాగు ప్రణాళిక
నవతెలంగాణ- బోనకల్
రుతుపవనాలు కాలమానం ప్రకారమే మన రాష్ట్రంలోనికి ప్రవేశించాయి. జూన్ ప్రారంభ సమయంలోనే నాలుగైదు రోజులు వరుసగా వర్షాలు కురిశాయి. తొలకరి తో ఆశల సాగుకు అన్నదాతలు నడుం బిగిం చారు. మండలంలో వానాకాలం పంటలను సాగు చేసేందుకు కొంతమంది అన్న దాతలు పొలాలను సిద్ధం చేస్తుండగా, మరికొంతమంది అన్నదాతలు పత్తి విత్తనాలను నాటారు. మండల పరిధిలోని 22 గ్రామాల రైతులు వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు ముమ్మరంగా పొలాలపై దృషి ్టసారించారు. వానాకాలం పంటలుగా మండల వ్యాప్తంగా 29 వేల 145 ఎకరాలలో వివిధ రకాల పంటలను అన్నదాతలు సాగు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారులు పంటల అంచనాను రూపొందిం చారు. గత సంవత్సరం 28 ,893 ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 252 ఎకరాలలో వివిధ రకాల పంటలను అన్నదాతలు సాగు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్బూరి శరత్ బాబు తెలిపారు. గత ఏడాది వరి 6,527 పత్తి 20, 084 మిర్చి 1,687 ఎకరాలలో అన్నదాతలు సాగుచేశారు. కంది 113 ఎకరాల్లో పెసర 451 ఎకరాల్లో మినుము 31 ఎకరాలలో అన్నదాతలు పంటలు సాగు చేశారు. ఈ యేడాది వానాకాలం పంటలుగా పత్తి 19,900 ఎకరాలలో వరి 6,250 ఎకరాల్లో మిర్చి ఇరవై మూడు వందల ఎకరాల్లో అన్నదాతలు సాగు చేయనున్నారు. కంది 165 ఎకరాల్లో పెసర 470 ఎకరాలలో మినుము 60 ఎకరాలలో అన్నదాతలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది మండలంలో పత్తి పంట సాగు చేసిన రైతులు వరుస వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. ఒక్కొక్క ఎకరానికి 25 వేల రూపాయల వరకు అన్నదాతలు పెట్టుబడి పెట్టారు. కానీ ఎకరానికి రెండు మూడు క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది. దీంతో అన్నదాతలు పత్తి పంటను సాగు చేసి అప్పుల పాలయ్యారు. పత్తి పంటకు తీవ్ర నష్టం జరగడంతో మధ్యలోనే ఆ పంటను తొలగించి అన్నదాతలు మొక్కజొన్న పంటను సాగు చేశారు. మొక్కజొన్న పంట వల్ల కొంతమేరకు అన్నదాతలు ఉపయోగం జరిగింది. కానీ వ్యవసాయ సీజన్ అంత పరిశీలిస్తే గత ఏడాది రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ఒకవైపు ప్రభుత్వ విధానం మరొకవైపు ప్రకృతి దెబ్బతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఈ ఏడాది వ్యవసాయం ఎలా ఉంటుందోనని ఆశల సాగుకు అన్నదాత మరోమార్గం లేక వ్యవసాయంపై దృష్టి సారించారు. పదిహేను రోజుల నుంచే వర్షాలు కురుస్తుండటంతో అనేక గ్రామాలలో పత్తి విత్తనాలను నాటారు. విత్తనాలు నాటిన దగ్గర నుంచే ఎండలు వస్తూనే ఉన్నాయి. ఈ ఎండలకు విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో అన్న దాతలు ఆందోళన చెందుతున్నారు. అన్న దాతలు ప్రతేడాదీ ఈ ఏడాది బాగుంటుందని ఆశతో వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఏదో ఒక రకంగా ప్రతి సంవత్సరం రైతులు నష్టపోతూనే ఉన్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రైతులకు చేదు అనుభవాలు ఎదురైతాయా, పంటల పరిస్థితి మంచిగా ఉండి రైతులు ఆనందంగా ఉండే విధంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందా చూద్దాం