Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
తాను జీవించిన కాలంలో పేద ప్రజల తలలో నాలుకలా మెదులుతూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం తపించిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ తవిడబోయిన గోపాల్ అని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ గుండాల(ఆర్జేసీ) కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్ కొనియాడారు. గోపాల్ వర్థంతి సభ ఆదివారం ఖమ్మం నగరంలోని సారధి నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వారు అతిధులుగా హాజరై ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోపాల్ మరణం ఈ ప్రాంత పేద ప్రజలకు తీరనిలోటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ, కనకం భద్రయ్య, ఆర్టీఐ మెంబర్ వల్లభనేని రామారావు, స్థానిక పెద్దలు మంగారావు, శ్యామ్ బాబు, కొమరయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.