Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- వలిగొండ
జూలై 2వ తేదీన వలిగొండలో స్థానిక సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ సంతాప సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం తుర్కపల్లి సురేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వేముల మహేందర్ క్యాన్సర్తో బాధపడుతూ మరణించాడని తెలిపారు .ఆయన సంతాప సభకు కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ సంతాప సభకు శాఖా కార్యదర్శులు మండల కమిటీ సభ్యులు జిల్లా మండల ప్రజా సంఘాల బాద్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అడ్డగూడూరు మండలంలో దొంగతనం కేసులో మరియమ్మ పై దాడి చేసి లాకప్ డెత్ కారణమైన వారిని పూర్తిగా డిస్మిస్ చేయాలని బాధితురాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మద్దెల రాజయ్య ,శ్రీశైలం రెడ్డి మెరుపు వెంకన్న ,గాజుల అంజనేయులు ,వాకిటి వెంకటరెడ్డి ,కొండయ్య ,కిష్టయ్య కర్ణ కంటి యాదయ్య ,ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.