Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-కొణిజర్ల
ఈనెల ఐదోవతేదీన 'ఉదయం అతికించారు.. రాత్రి తొలిగించారు'..అనే శీర్షికతో నవతెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనంపై అధికారులు ఎట్టకేలకు స్పందించారు. తనికెళ్ళ సమీపంలో జాతీయ రహదారి పక్కన అనుమతులు లేకుండా శ్రీనీధి వెంచర్ నిర్వహకులు ఆర్చీని నిర్మించి వెంచర్లోకి రహదారి నిర్మాణం చేపట్టడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో అనుమతులు లేకుండా వెంచర్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని వెంచర్ నిర్వహకులకు సూచించారు. సదరు వెంచర్ యాజమాని మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో జిల్లా కలెక్టర్ అదేశాలమేరకు జిల్లా డిపివో ప్రభాకర్ డిఎల్పివో పుల్లారావు బుధవారం మధ్యాహ్నం జెసిబితో ఆర్చిని పూర్తిగా కూల్చివేయించారు. ఇదేవిధంగా మండలంలో అధికారులు అనుమతులు లేని వెంచర్లు అయినటువంటి ఇండోఖతర్, రాజహంస, పిటి కనస్ట్రక్షన్, పుష్ప ధర్మస్థలి తదితర వెంచర్లకు నోటీసులు అందజేశారు.