Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
సీపీఐ(ఎం) అధ్వర్యంలో ఈ నెల 15 నుండి ఆగస్ట్ 15 వరకు జరిగే క్షేత్ర స్థాయి శాఖ మహాసభలను జయప్రదంగా నిర్వహించాలనీ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆన్నవరపు కనకయ్య పిలుపు నిచ్చారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కనకయ్య మాట్లాడారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) మహా సభలు బస్తీ శాఖల నుండి, జాతీయ స్థాయి మహాసభలు ఆగస్ట్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు దేశ వ్యాప్తంగా జరగబోతున్నాయని తెలిపారు. ఈ మహాసభలలో పార్టీ క్షేత్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నిర్వహించిన సైద్ధాంతిక, రాజకీయ, సామాజిక అంశాలలో పార్టీ చేసిన కృషి, ప్రజా పోరా టాల్లో, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం నిర్వ హించిన కృషిపై చర్చించ బోతున్నట్టు ప్రకటించారు. భవిష్యత్ ఉద్యమాలకు వేదికలుగా మహాసభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్, జిల్లా కమిటీ సభ్యులు లిక్కి బాలరాజు, సందకూరి లక్ష్మి, జునుమల నగేష్, జిబి.నాగరాజు, కర్ల వీరస్వామి, ఎమ్మెస్ ప్రకాష్, నందిపాటి రమేష్, అవుల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.