Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ చొరవతో రాకపోకలు పునరుద్ధరణ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని భద్రాచలం చర్ల ప్రధాన రహదారి గంగోలు గ్రామ శివారులో మంగళవారం ఉదయం భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోయింది. దీంతో వాహన దారులు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వృక్షం నేలకొరిగ నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఎస్ఐ రవి కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో భారీ వృక్షాన్ని అడ్డు తొలగించారు. దీంతో వాహన దారుల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.