Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బజారున పడ్డా టీఆర్ఎస్ గ్రూపులు
- సోషల్మీడియాలో మాజీ ఎమ్మెల్యేపై కామెంట్లు
- దాడులు చేసుకున్న కార్యకర్తలు
నవతెలంగాణ-కారేపల్లి
టీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలు కారేపల్లి మండలంలో బజారుపడ్డాయి. గ్రూపు రాజకీయాలు శృతిమించితోపులాట తన్నులాట వరకు వెళ్లింది. కారేపల్లిలో శనివారం రాత్రి నుండి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లతో రచ్చకెక్కిన తగాదాలు ఆదివారం తోపులాట, దాడుల వరకు వెళ్ళింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి గ్రామపంచాయతీ టీఆర్ఎస్ పాలక వర్గంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూపులో విడిపోయి ఉన్నారు. ఈ క్రమంలో పంచాయతీ నిధులు వినియోగంలో అవకతవకలపై మాజీ ఎమ్మెల్యే అనుచరులైన వార్డు సభ్యులు ఫిర్యాదులు చేయటం, విచారణ పూర్తి అయి సర్పంచ్, ఉపసర్ఫంచ్ సస్పెండ్ అయి తిరిగి పునర్నియామకం జరిగింది. దుర్వినియోగం అయిన నిధులను బాధ్యుల నుండి రికవరీ చేయాలని వార్డు సభ్యుడైనా ఎస్కే.గౌసుద్దీన్ హైకోర్టుకు, హెచ్ఆర్సీ వరకు వెళ్లాడు. దీనిపై విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి మాజీ ఎంపీ వర్గీయుడైన ఇమ్మడి తిరుపతిరావు వాట్సప్లో పెట్టిన కామెంట్ వివాదమైంది. వార్డు సభ్యుడైన ఎస్కె.గౌసుద్దీన్ను అడ్డం పెట్టుకోని మాజీ ఎమ్మెల్యే నన్ను డబ్బులు అడిగిస్తున్నాడని, ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కు రూ. 50వేలు, నాకు రూ. 30 వేలు ఇవ్వాలంటూ రూ.80 వేలు ఇవ్వలంటూ బెదిరించి డబ్బులు తీసుకున్నాడని వాట్పస్ మెసేజ్లో ఆరోపించాడు. ఈమెసేజ్పై మాజీ ఎమ్మెల్యే వర్గీయులు భగ్గుమన్నారు. ఇమ్మడి తిరుపతిరావు చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఇమ్మడి తిరుపతిరావుపై మాజీ ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తోపులాట తన్నులాట
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇమ్మడి తిరుపతిరావు ఉన్నాడని విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ వర్గీయులు కార్యాలయానికి వెళ్ళి ఇమ్మడి తిరుపతిరావును బయటకు రావాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పార్టీ నూతన అధ్యక్షుడు తోటకూరి రాంబాబు జోక్యం చేసుకోని విషయంపై ఆరా తీస్తుండగా విషయం తెలియని నీవు ఏమి అధ్యక్షుడివి అంటూ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు వ్యాఖ్యనించటంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగి నెట్టుకున్నారు. కారేపల్లి ఎస్సై పీ.సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి ఇరువర్గాలను సముదాయించి పంపించి వేశారు.
అనంతరం ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగే బోనాల ఉత్సవానికి హాజరైనాడు. ఎమ్మెల్యే కార్యక్రమంలో నడుస్తుండగా మాజీ ఎమ్మెల్యే వర్గీయుడైన వార్డు సభ్యుడు ఎస్కె.గౌసుద్దీన్, వాట్సఫ్లో తిరుపతిపరావు కామెంట్ను సమర్ధిస్తూ కామెంట్ చేసిన మజీద్ పాషాపై దాడి చేశాడు. దీంతో కారేపల్లి ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది.