Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రజలు, ప్రతిపక్షాల సమక్షంలో ఓ మీడియా (రాజ్ న్యూస్) ఛానల్ చర్చా వేదిక నిర్వహిస్తున్న సమయంలో అదే ఛానల్కు చెందిన జర్నలిస్టులపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని దుమ్ముగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, తహశీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రత్తయ్య, ఆర్ఐ ఆదినారాయణలకు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో వివిద సత్రికలకు చెందిన విలేఖరులు మచ్చా వెంకటరమణ, ఎస్కె.ఖాసీం, కర్రి సురేష్ కుమార్, పూదోట సూరిబాబు, బొల్లె రాము, నాగేశ్వరరావు, అశోక్ తదితరులు ఉన్నారు.