Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అశ్వాపురం
మండలంలో బుధవారం బక్రీద్ పండుగ వేడుకను ముస్లీం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఉదయాన్నే తలంటి స్నానాలు నూతన వస్త్రాలు ధరించి మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. నమాజ్ ముగించుకున్న అనంతరం ఒకరి నొకరు ఆలింగనాలు చేసుకుని ఈద్ముబారక్ అంటు ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు ఎస్కె. జలీల్, ఎస్డీ అన్వర్, మతగురువులు ఇబ్రహిం, జమ మసీదు కమిటి సభ్యులు ఎస్కె. ఖలీల్, ఎస్కె. ఖదీర్, మునీర్, ఎస్డీ యాకూబ్, ఎస్కె. అంజత్ పాల్గొన్నారు.