Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్
- హామీలు అమలు చేయకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే.. : కాసాని
నవతెలంగాణ-కొత్తగూడెం
రేగళ్ళ రెవెన్యూ పరిధిలో ఉన్న భూమి సమగ్ర సర్వే చేసి రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. బుధవారం లక్ష్మిదేవిపల్లి మండలం బావోజీతండా గ్రామంలో పార్టీ మహాసభ తేజవాత్ వెంకన్న అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ మండలంలో కొన్ని వందల సంవత్సరాల నుండి గిరిజన, గిరిజనేతర పేదలు సాగుచేస్తున్న భూములకు పట్టాలు లేకపోవడంతో తీవ్రమైన అవస్థలు పడుతున్నారని తెలిపారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒకే తాను గుడ్డలేనని విమర్శించారు. రాబోయే కాలంలో హామీలు అమలు చేయకపోతే గత ప్రభుత్వాలు ఏ గతి పట్టిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఈ మహాసభలో పార్టీ జిల్లా నాయకులు జాటోత్ కృష్ణ మండల కార్యదర్శి నల్లమల సత్యనారాయణ ఉప్పెన పల్లి నాగేశ్వరరావు వాంకుడోత్ కోబల్, వాంకుడోత్ అమర్ సింగ్, భానోత్ మల్సూర్ పాల్గొన్నారు. ఈ మహాసభలో గ్రామ శాఖ వన్ కార్యదర్శి వాంకుడోత్ సురేష్, టు కార్యదర్శిగా తేజావత్ శ్రీనులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.