Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పిడుగుపాటుతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు పాలు అయిన సంఘటన గురువారం కాశీనగరం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...గురువారం ఉదయం నుండి భారీ వర్షం కురుస్తుండడంతో కాశీనగరం గ్రామాని పూనెం వెంకటేశ్వరరావు (కర్ణుడు)తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు చేపల వేట కోసం మధ్యాహ్నం సమయంలో గ్రామ సమీపంలోని వర్షం వరద ప్రవహిస్తున్న పంట పొలాల వద్దకు చేపల వేట కోసం వెళుతున్నారు. ఆ సమయంలో పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు రావడంతో వెంకటేశ్వరరావు పిడుగు పాటుకు గురయ్యాడు. దీంతో వెంకటేశ్వరరావు ఒళ్లు పలు చోట్ల కాలిపోయినట్లు అయింది. వెంటనే పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో పాటు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది పిడుగు పాటుకు గురైన వెంకటేశ్వరరావును దుమ్ముగూడెం వైద్యశాలకు తరలించి ప్రాదమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. కాగా వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.