Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలో అన్ని వార్డులలో పారిశుద్యం అస్థవ్యస్తంగా ఉందని, కారణంగా దోమలు పెరిగిపోతున్నాయని, కోతులు, పందుల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది. సోమవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో (ఐద్వా) అన్నవరపు ఇందిరా అధ్యక్షతన జరిగిన టౌన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టౌన్ కార్యదర్శి సందకూరి లక్ష్మి మాట్లాడారు. కోతులు ఇళ్లల్లోకి దూరి మనుషుల మీద దాడి చేస్తున్నాయని తెలిపారు. పారిశుద్యం సరిగాలేదని, వర్షాకాలం మూలన సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు ఎలకొండ అరుణ, రజిత, పద్మ, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు