Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని పందిళ్ళపల్లి గ్రామంలో పార్టీ గ్రామశాఖ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు ప్రజల తరపున నికరంగా పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై, గ్రామంలో డ్రయినేజీ, సిమెంట్రోడ్లు, ఇండ్ల స్థలాలు,పెన్షన్స్ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం శాఖా కార్యదర్శిగా లింగం కోటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మధిర నియోజకవర్గ కన్వినర్ చింతలచెర్వు కోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, పార్టీ మండల కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు, శాఖా కార్యదర్శి లింగం కోటేశ్వరరావు, నాయకులు కొల్లి నారాయణ, మంగు ప్రసాద్,లింగం ప్రభాకర్,బండ్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.