Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.7 కోట్లు ఉందటుందని ఎస్పీ సునీల్ దత్ వెల్లడి
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండల పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారని, దాని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు.బుధవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఎర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ సునీల్ దత్ వివరాలను వెల్లడించారు. భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్లు చుంచుపల్లి పోలీసులకి విశ్వసనీయ సమాచారం మేరకు చుంచుపల్లి ఎస్ఐ తన సిబ్బందితో మండలంలోని బృందావనం బ్రడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఇందులో భాగంగా చేపలతో రవాణా జరుగుతున్న (టీఎస్10యూఏ 4801), (హెచ్ఆర్30జెడ్ 1159) నెంబరు గల ఏయిచర్ వాహనాలను అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు వాహనాల నుంచి రూ.7,30,62,000 విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. గంజాయి తరలిస్తున్న ఏయిచర్ వ్యాన్ డ్రైవర్లు కేస్లే వెంకటేశ్, సేస్లే సుభాష్, కిడ్లే నఫీజ్, ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు. ఈ గంజాయి చింతూరులో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తీసుకుని ఒక వాహనాన్ని హైదరాబాద్కి, మరో వాహనాన్ని హర్యానాకు తరిస్తుండగా చుంచుపల్లి పోలీసులు చేధించి పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. భారీ మొత్తంలో గంజాయిని సీజ్ చేసిన ఎస్ఐ మహేష్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ గుడ్లు వెంకటేశ్వర బాబు, చుంచుపల్లి సీఐ గురుస్వామి, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.