Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కొణిజర్ల
ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామంలో గ్రామశాఖ మహాసభ చింతనిప్పు సూరయ్య నివాసంలో యాసా అనంత రామయ్య నగర్లో యాసా జగ్గారావు మంగమ్మ అధ్యక్షతన గురువారం జరిగింది. ముందుగా పార్టీ సీనియర్ నాయకులు సూరయ్య పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో నున్నా మాట్లాడుతూ అమరవీరుల స్పూర్తితో పోరాటాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలువంచి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అదే విధంగా గ్రామంలో ఇటీవల మరణించిన పార్టీ సభ్యుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ గ్రామశాఖ కార్యదర్శిగా అన్నారపు వెంకటేశ్వర్లు తిరిగి రెండోసారి ఎన్నికైయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, మండల సీనియర్ నాయకులు కొప్పుల కృష్ణయ్య, మండల కార్యదర్శి తాళ్లపళ్లి కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు బాణోత్ బాలాజీ, యసా తిలక్, లక్ష్మీ, చల్లా నారాయణ, ప్రసాద్, వెంకయ్య, ప్రభాకర్రావు, సత్యవతి, పద్మిని, వెంకటరమణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.