Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని, ఓపిక పడితే త్వరలోనే మంచిరోజులొస్తాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలోని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం తుమ్మలను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తమపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని తుమ్మల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఖమ్మం నగర సీపీని, కలెక్టర్ని సోమవారం కలిసి వినతిపత్రం ఇవ్వాలని తుమ్మల సూచించినట్లు తెలిసింది. అంతేకాకుండా పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్లు వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. తుమ్మలను కలిసి వారిలో నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, మద్ది మల్లారెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, శాఖమూరి రమేష్, ధరావత్ రామ్మూర్తి నాయక్, వెన్నపూసల సీతారాములు, నెల్లూరి భద్రయ్య, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, జంగం భాస్కర్, మద్దినేని మధు, బండి జగదీశ్ తదితరులు ఉన్నారు.