Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఇంటి పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ''డ్రై డే'' సందర్భంగా నగరంలోని పలు డివిజన్లలో జిల్లా కలెక్టర్ పర్యటించి ''డ్రై డే'' కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రజలకు పలు సూచనలు చేసారు. నగరంలోని వికలాంగుల కాలనీలో ఇంటింటికి తిరిగి నీటి నిల్వలు, ఇంటితోపాటు పరిసరాల పరిశుభ్రత పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యరాణి, అసిస్టెంట్ కమీషనర్ మల్లీశర, మెడికల్ ఆఫీసర్ కనకదుర్గ, ఏ.ఎం.ఓ వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియ అధికారి డాక్టర్ సంధ్య, కార్పోరేటరు రఫీదాబేగం తదితరులు పాల్గొన్నారు.