Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్కు వినతి
నవతెలంగాణ-గాంధీచౌక్
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరమ్ (టీయూడిఎఫ్) జిల్లా కన్వీనర్ యర్రా శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం అర్బన్ తాసీల్దార్కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత రెండు యేండ్ల క్రిందటి దరఖాస్తులు పెట్టుకున్న వారికి మొన్న రేషన్ కార్డులు జారీ చేసారని, ఇంకా రేషన్ కార్డులు లేని వారు చాలా మంది ఉన్నారన్నారు. అర్బన్ తాసీల్డార్ మాట్లాడుతూ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్లో సైట్ ఓపెన్ అవుతుందని, మరల రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడిఎఫ్ నాయకులు బండారు రమేష్, 35వ డివిజన్ కార్పొరేటర్ ఎల్లంపల్లి .వెంకటరావు, షేక్.హిమాం, సారంగీ పాపారావు, జంగం నగేష్ పాల్గొన్నారు.