Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7న చాడ వెంకటరెడ్డి పర్యటన
- కొదుమూరు నుండి తిమ్మారావుపేట వరకు భారీ ర్యాలీ
నవతెలంగాణ -ఖమ్మం
పోడు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంభిస్తుందని, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో జరిగే పోడు యాత్రను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగంహేమంరావు కోరారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయం (గిరిప్రసాద్ భవనం ) లో సిపిఐ జిల్లా సమితి సమావేశం జమ్ముల జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో హేమంత రావు మాట్లాడుతూ ఈనెల 4న కుమరంభీమ్ తోడేఘాట్లో ప్రారంభమైయే యాత్ర ఖమ్మం జిల్లాలో చాడ వెంకటరెడ్డి నేతత్వంలో ఈనెల 7న జరుగను న్నదని తెలిపారు. ఖమ్మం సిపిఐ కార్యాలయంలో ప్రారంభమవుతుందన్నారు. అక్కడ నుండి ర్యాలీ చింతకాని మండలం కొడుమూరుకు చేరుకుంటుం దని. అక్కడ పోడు రైతులతో సమావేశం జరుగుతుం దన్నారు. కొదుమూరు నుండి ఇల్లెందు రోడ్ మీదుగా ముచ్చర్ల క్రాస్ రోడ్ నుండి తిమ్మారావుపేట వరకు ర్యాలీ అక్కడ బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, కార్యవర్గసభ్యులు మహ్మద్ మౌలానా, రింగునర్సిం రహారావు, ఎస్.కె. జానీమియా పాల్గొన్నారు.