Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపి నామ
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
దేశ జీడీపీ పెరుగుదలలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల తోడ్పాటెంతని టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మంగళవారం దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి వ్యవసాయరంగం నుంచి అందుతున్న తోడ్పాటు గురించి ఎంపీ నామ లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. నామ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం ఇస్తూ వ్యవసాయం వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్రాలు తీసుకుంటున్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తునే మరోవైపు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, సంస్కరణలు ప్రవేశపెట్టడంతోపాటు బడ్జెట్లో వ్యవసాయరంగానికి అధికంగా నిధులను కేటాయిస్తున్నామన్నారు. కనీస మద్ధతు ధరలో ఒకటిన్నర రెట్లు భరించడం, పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆదాయ మద్దతు, అగ్రికల్చర్లో పెట్టుబడులు పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు.