Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
పోడుసాగుదారులపై ఫారెస్టు అధికారులు మంగళవారం దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ చేతికి గాయమైంది. ఎల్లన్న నగర్ సమీపంలో గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో ఎల్లన్న నగర్ గ్రామానికి చెందిన కొంతమంది ఉమ్మడిగా పత్తి సాగు చేస్తున్నారు. మంగళవారం ఫారెస్ట్ రేంజర్ రాధిక ఆధ్వర్యంలో కొణిజర్ల, గుబ్బగుర్తి సెక్షన్ అధికారులు రాము, వెంకన్నతో పాటు కొంతమంది బీట్ అధికా రులు ఎల్లన్న నగర్ వాసులు సాగు చేసిన అటవీ భూమి వద్దకు చేరుకొని పత్తి మొక్కలను పీకేస్తుండగా విషయం తెలుసు కున్న పోడుసాగుదారులు సంఘటనా స్థలానికి చేరుకుని తమ పంటలను ధ్వంసం చేయవద్దని ప్రాధేయ పడ్డారు. ఈ క్రమంలో తమను అడ్డుకుం టున్నారనే ఆగ్రహంతో ఫారెస్టు అధికారులు తమపై దాడి చేసినట్లు పోడు సాగుదారులు తెలిపారు. ఫారెస్ట్ అధికారుల దాడిలో తారకమ్మ చేతికి గాయమైంది.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ
ఇరువర్గాల మధ్య ఘర్షణ విషయాన్ని ఫోన్ ద్వారా తెలుసుకున్న వైరా ఏసీపీ సత్యనారాయణ సిబ్బంది తో సంఘటన చేరుకున్నారు. సంఘటనపై విచారించారు. కాగా తమపై దాడి చేశారని స్థానిక పోలీస్టేషన్లో ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేయడం విశేషం.