Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
నవతెలంగాణ-దేవరకొండ
నేరేడుగొమ్ము మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పందిరిగుం డుతండా, కిందిములతండా, పైములతండా గ్రామాల్లో నిర్వహించిన పార్టీ శాఖ మహాసభల్లో ఆయన మాట్లాడారు. చందంపేట మండలం నుంచి విడిపోయి ఆరేండ్లు కావస్తున్నా నేటి వరకూ పీహెచ్సీ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి నాగటి నాగరాజు, పాత్లావత్ రవీందర్, ముడావత్ నాగేష్, ముడావత్ కాల్యా, రాంసింగ్, దేవీసింగ్, సోమ్లా, హరి, సునీత తదితరులు పాల్గొన్నారు.