Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని
- సీపీఐ నుంచి పలు కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరిక
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల గారడీతో ప్రజలను నట్టేట ముంచుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మండలంలోని ఏదులాపురం గ్రామంలో ఆదివారం 16వ గ్రామ శాఖ మహాసభ పొన్నెకంటి నర్సింహారావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సభలో పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ బడా పెట్టుబడి దారులకు, పారిశ్రామికవేత్తలకు తొత్తుగా ఉంటూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా దీక్ష చేస్తున్న రైతులపై కనికరం లేకుండా రాజద్రోహం కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ దళిత బంధుపై నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు కల్పించడం లేదన్నారు. ఎల్లన్న గూడెంలో పోడు సాగు చేస్తున్నారని, చంటి పిల్లలు ఉన్న 20 మంది మహిళలపై కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు.కోవిడ్ ను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ను ధైర్యంగా ఎదుర్కొన్నవి కమ్యూనిస్టు రాజ్యలే అని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాలే ప్రజా ఉద్యమ కేంద్రాలుగా ఉంటాయని తెలిపారు. అనంతరం నూతన శాఖ కార్యదర్శిగా రెండవసారి దుండిగల నాగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ నుంచి సిపిఎంలోకి వచ్చిన పొన్నెకంటి చక్రవర్తి, పొన్నెకంటి మురళి, పొన్నెకంటి వంశీ, చినుముల నవీన్, గుండేటి ఆనందరావు, మురళిలను పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, సీపీఎం సీనియర్ నాయకులు మామిండ్ల సంజీవరెడ్డి, కార్పొరేషన్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్రెడ్డి, మండల నాయకులు పొన్నెకంటి సంగయ్య, ఏదులాపురం సొసైటీ చైర్మన్ ఉరడీ హైమావతి, డివైఎఫ్ఐ నాయకులు గడ్డం సిద్దూ, పొన్నెకంటి అనీష్, ఉరడీ చంటి, వల్లెపు సోమరాజు, అరేంపుల నరేష్, లక్ష్మణ్, ప్రతాప్, డి.వెంకటేశ్వర్లు, కొండ రవి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.