Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్సభలో గళమెత్తిన టీఆర్ఎస్ లోక్సభ నేత నామ
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్సభ వేదికగా డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రవేశపెట్టిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు-2021 పై సోమవారం జరిగిన చర్చలో ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అమలు అవుతున్న రైతుబంధు పథకం తరహాలోనే కేంద్ర ప్రభుత్వం సైతం రైతులకు దేశ వ్యాప్తంగా పెట్టుబడి సాయాన్ని ప్రకటించిందన్నారు. ఓబీసీ బిల్లు తీసుకురావడం మంచి పరిణామంగా భావిస్తున్నామన్నారు. ఓబీసీ బిల్లుకు టిఆర్ఎస్ పక్షాన సంపూర్ణ మద్ధతును తెలుపుతున్నామని లోక్సభలో ఎంపి నామ ప్రకటించారు.