Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
కోయగూడెం ఓపెన్ కాస్ట్ 3 కోసం చేపట్టిన పోడు, రెవిన్యూ భూముల సర్వేలో తప్పులను సరి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కోయగూడెం గ్రామ శాఖ 5వ మహాసభ పూనెం చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. మహాసభలో ఆయన మాట్లాడారు. కోయగూడెం ఓసీ 3 పేరుతో ఫారెస్ట్, రెవిన్యూ భూములను సర్వే చేశారని, ఈ సర్వేలో అనేక మంది గిరజనుల పేర్లు రాలేదని, రీ సర్వే చేసి వారి భూములు వారి పేర్లతో నమోదు చేయాలని కోరారు. అనంతరం కోయగూడెం గ్రామ శాఖ కార్యదర్శిగా పూనెం స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నరసింహారావు, మండల కమిటీ సభ్యులు వీరన్న, స్వామి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.