Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన మహిళలు మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పిటిసి బెల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేదలైన కుటుంబాలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకుండా భూములు ఉన్నటువంటి ధనిక కుటుంబాలకు ఇచ్చారని వారు ఆరోపించారు. వెంటనే అర్హులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం అర్హులైన పేదల వివరాలను తహశీల్దార్ కోట రవికుమార్కు అందజేశారు.