Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ సుజాతనగర్
ఢిల్లీలో రైతులు నిర్వహించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య అన్నారు. సోమవారం నాయకులగూడెం గ్రామ శాఖ మహాసభలు గూని అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో వారు పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, 600 మంది రైతులు చనిపోయిన మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు పెంచి, సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఒకపక్క కరోనా విజృంభిస్తుంటే పెట్రోల్, డీజిల్, ,గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వీర్ల రమేష్, తిరుపతిరావు, భాస్కర్, శ్రీను, నాగ చందర్, వెంకటేశ్వర్లు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.