Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకరించిన సర్పంచ్లు
నవతెలంగాణ-కారేపల్లి
బస్వాపురం నుండి ఎర్రబోడు బీటీ రోడ్డు గుంతలు పడి వాహన చోదకులు ఇబ్బందులు పడుతుండటంతో స్పందించిన ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా గుంతలు పూడ్చటానికి మంగళవారం ముందుకొచ్చారు. మాణిక్యారం, ఎర్రబోడు సర్పంచ్లు భూక్యా రంగారావు, కుర్సం సత్యనారాయణ, మాజీ సొసైటీ డైరక్టర్ అడపా పుల్లారావులు సహకరించి గ్రామపంచాయతీ ట్రాక్టర్లను ఇవ్వటంతో ఆటో డ్రైవర్లు మరంతో గుంటలను పూర్తి వేశారు. సహకరించిన వారికి ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు.