Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
బోనకల్ - ఆళ్ళపాడు రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపడుతున్న సమయంలో అన్నదాతలు తమ పొలాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రహదారిని తహసీల్దార్ రావూరి రాధిక మంగళవారం పరిశీలించారు. ఆళ్లపాడు అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం అయితే బోనకల్ అన్నదాతలు తమ పొలాలకు వెళ్లేందుకు మరో మార్గం లేదు. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. దీంతో నవతెలంగాణ దినపత్రికలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అన్నదాతలకు ఇబ్బందులు అను కథనం ఇటీవల ప్రచురితమైంది. రైతుల ఇబ్బందుల దృష్ట్యా రావూరి రాధిక ప్రత్యామ్నాయ రహదారి కోసం స్థలాన్ని గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. సంబంధిత రైల్వే కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ రహదారిని సరైన రీతిలో ఏర్పాటు చేయకపోవడంతో మంగళవారం రైతులు తాసిల్దార్ కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గూగులోతు రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, బోనకల్ గ్రామ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.