Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో డబుల్ బెడ్రూమ్ గహాల పనులను త్వరగా పూర్తి చేసేందుకు సత్వర చర్యలు చేపట్టా లని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారు లను ఆదేశించారు. కలెక్టరేట్ లో గురువారం సాయం త్రం ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ గహాల పనులపై కలెక్టర్ శాఖల వారీగా సమీక్షిం చారు. జిల్లాలోని మధిర నియోజకవర్గం లోని ముదిగొండ మండలం లక్ష్మీపురం, చిన్నబీరవల్లి, పమ్మి, మధిర మండలం ఇల్లూరు, ఎర్రుపాలెం మండలం జమలాపురం, పాలేరు నియోజకవర్గం లోని నాయకన్ గూడెం, ఖమ్మం అర్భన్ ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ గహాల నిర్మాణం పెడింగ్ కు కారణాలను కలెక్టర్ సమీక్షించారు. గహసముదాయాల నిర్మాణాలకు ఇప్పటికే గుర్తించిన స్థలాలు అనువుగా లేవన్నారు. ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలన్నారు. గ్రామాలలో పురోగతిలో ఉన్న గహ సముదా యాల పనులను త్వరగా పూర్తి చేయాల న్నారు. స్థలాలు గుర్తించని మండలాల్లో యుద్ధ ప్రాతి పదికన అనువైన స్థలాలను గుర్తించి పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా మండలాల్లో గహసముదాయాల నిర్మాణా లకు సంబంధించిన సమస్యలపై సంబంధిత తహశీల్దార్ల నుంచి సమగ్ర నివేదిక కోరాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఇ.డబ్ల్యూ. ఐ.డి.సి ద్వారా చేపడుతున్న గహసముదాయాల పనులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటిక ప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయా ఏజెన్సీల బాధ్యులను సమన్వయపర్చి పనులు త్వరగా పూర్తయ్యేలా సత్వర చర్యలు చేపట్టాల న్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్, జి.వి.చంద్ర మౌళి, ఇ.డబ్లూ.ఐ.డి.సి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వీరు పాక్షి పాల్గొన్నారు.