Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావును వైరా శాసన సభ్యులు లావుడ్య రాములునాయక్ గురువారం కలిశారు. ఎంపీ స్వగహంలో నామ నాగేశ్వరరావు ఎమ్మెల్యే రాములు నాయక్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైరా నియోజకవర్గం అభివద్ధి పనులపై చర్చించారు. అభివద్ధి పనుల ప్రతిపాదన వివరాలను ఎంపీ నామకు ఎమ్మెల్యే రాములునాయక్ అందించారు. ఎమ్మెల్యేతో పాటు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు కూడా నామను కలిశారు.