Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యర్రబోయనపల్లి శాఖా కార్యదర్శి గా పుల్లయ్య ఎన్నిక
నవతెలంగాణ-కల్లూరు
రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు కూడా కూలి బంధు అమలు చేసి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఎర్ర బోయినపల్లి గ్రామంలో శనివారం సిపిఎం గ్రామశాఖ మహాసభ బీరవెల్లి పుల్లయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన దళితులందరికీ దళితబంధు అమలు చేయాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పథకం పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే తూతూమంత్రంగా జరిపి నిలిపి వేశారన్నారు.
అనంతరం గ్రామ కమిటీ ఎన్నిక జరగగా దోమతోటి పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు, బీరవెల్లి. బాబు, తిగుళ్ళ. బాబు, తిరుపతిరావు, బీరవెల్లి. రవీంద్ర, బీరవెల్లి. మోహన్రావు, శీలం. స్వామి, బీరవెల్లి. నరసింహ, తదితరులు పాల్గొన్నారు.